News November 21, 2024
ధనుష్-ఐశ్వర్య విడాకులపై తుది తీర్పు ఆరోజే..

తమ విడాకుల కేసు విచారణ కోసం నటుడు ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారు మళ్లీ కలవబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దీంతో ఫుల్స్టాప్ పడింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి తుది తీర్పును ఈ నెల 27కి వాయిదా వేశారు. 2004లో వీరిద్దరికీ పెళ్లైంది. యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులున్నారు. తాము విడిపోనున్నట్లు 2022, జనవరి 17న సోషల్ మీడియా వేదికగా ధనుష్ ప్రకటించారు.
Similar News
News April 19, 2026
నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.
News April 19, 2026
నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.
News April 19, 2026
భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై రేపటి నుంచి చర్చలు!

USతో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ అమలుపై భారత్ ఆ దేశంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరపనుంది. ట్రంప్ టారిఫ్స్ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారిగా భారత్ బృందం వాషింగ్టన్కు చర్చలకు వెళ్లనుంది. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ సహా 16 దేశాల వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించడంపైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా USకు 10% టారిఫ్ చెల్లిస్తోంది.


