News November 21, 2024
13 నెలల యుద్ధం.. 44,056 మరణాలు: పాలస్తీనా

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 13 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గాజాలో 44,056 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు ప్రకటించారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు. శిథిలాల కిందే వేలాది మృతదేహాలు సమాధి అయ్యాయని, తాము ప్రకటించిన దానికంటే మరణాలు ఎక్కువే ఉండొచ్చని వెల్లడించారు. అలాగే 1,04,268 మంది గాయపడ్డారన్నారు. మరోవైపు 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


