News November 22, 2024
అదానీపై అభియోగాలు: వైట్హౌస్ ఏం చెప్పిందంటే..

గౌతమ్ అదానీపై నమోదైన అభియోగాలపై అవగాహన ఉందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జేన్ పియరీ తెలిపారు. ఆరోపణలపై మరింత సమాచారం కావాలంటే SEC, DOJను సంప్రదించాలని సూచించారు. ఈ వివాదంతో భారత్, అమెరికా మధ్య విభేదాలేమీ ఏర్పడవని ధీమా వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలు బలమైన పునాదులపై నిర్మించారని, గ్లోబల్ ఇష్యూస్పై పూర్తి స్థాయి పరస్పర సహకారం ఉంటుందన్నారు. ఈ వివాదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<