News November 22, 2024

సబ్‌మెరైన్‌ను ఢీకొట్టిన చేపల వేట పడవ

image

గోవాలో ఓ సబ్‌మెరైన్‌ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్‌మెరైన్‌కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.

Similar News

News January 1, 2026

డిసెంబర్ GST వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

image

డిసెంబర్ 2025లో భారత GST వసూళ్లు 6.1% వృద్ధి చెంది ₹1.75 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 19.7% పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశీయంగా మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలు బలమైన వృద్ధిని కనబరచగా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం వసూళ్లు 8.6% పెరిగి ₹16.50 లక్షల కోట్లకు చేరడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోంది.

News January 1, 2026

జీడిమామిడి పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.

News January 1, 2026

2026 ఎన్నికల హడావుడి.. ఎవరి కోట కదిలేనో?

image

2026లో బెంగాల్, TN, కేరళ, అస్సాం అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఉండనుంది. WBలో మమతకు BJP పోటీ ఇస్తుంటే.. తమిళనాడులో విజయ్ ఎంట్రీతో లెక్కలు మారాయి. కేరళలో లెఫ్ట్ కోట కదులుతుండగా.. అస్సాంలో కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. APలో పంచాయతీ, TGలో మున్సిపల్ ఎన్నికలు లీడర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలూ ఈ ఏడాది హాట్‌ టాపిక్‌గా కానున్నాయి.