News November 22, 2024
మీకు వేగంగా తినే అలవాటు ఉందా..?

భోజనం వేగంగా తినడం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. తినే ఆహారం మాత్రమే కాదు, తినే విధానమూ ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నిదానంగా భోజనం చేసే వారిలో డయాబెటిస్, PCOD, హై బీపీ వంటి సమస్యలు తక్కువని వివరిస్తున్నారు. తొందరగా తినే అలవాటు వల్ల జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి Relax and Eat. SHARE IT.
Similar News
News March 22, 2026
ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.
News March 22, 2026
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: అమిత్ షా

అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ <<19447588>>రికార్డ్<<>> నెలకొల్పిన నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని.. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇందుకే ప్రజలు ఆయనను మూడు సార్లు గుజరాత్ సీఎం, మూడు సార్లు భారత ప్రధానిని చేశారని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
News March 22, 2026
వరి వద్దు ఈ పంటలు వేయండి: సీఎం

TG: కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశంలో పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా నిల్వలు మిగిలే ఉంటున్నాయి. ఈసారి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ వరి కొనబోమని కేంద్రం చెప్పింది. ఇప్పటికే 70 లక్షల టన్నులు కొన్నాం. మిగతా వరి ఏం చేయాలి? అందుకే రైతులు మిల్లెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించాలి’ అని సిద్దిపేటలో సూచించారు.


