News November 23, 2024
బాబాయ్పై అబ్బాయి ఆధిక్యం..

మహారాష్ట్ర సీఎం అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న అజిత్ పవార్ ఆశ్చర్యకరంగా ఫలితాల్లో వెనకబడ్డారు. బారామతిలో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఆధిక్యత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. యుగేంద్ర తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అటు కొప్రిలో సీఎం ఏక్నాథ్ శిండే ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News October 16, 2025
రంజీ ట్రోఫీ.. 40 ఏళ్ల వయసులో రికార్డు

రంజీ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా J&K కెప్టెన్ పరాస్ డోగ్రా(40 ఏళ్లు) నిలిచారు. ముంబైతో మ్యాచులో ఆయన 32వ సెంచరీ నమోదు చేశారు. 42 సెంచరీలతో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రంజీల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో జాఫర్ (12,038) తర్వాత డోగ్రా(9,500) రెండో స్థానంలో ఉన్నారు. 2001-02లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన డోగ్రా గతంలో HP, పుదుచ్చేరి జట్లకు ఆడారు.
News October 16, 2025
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లుగా ఉంది.
News October 16, 2025
అఫ్గాన్కు భారత్ సపోర్ట్.. పాక్కు చావుదెబ్బ!

‘శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు’ అని చాణక్యుడు చెప్పారు. TTP అధినేతను హతమార్చేందుకు పాక్ అటాక్ చేయడంతో అఫ్గాన్ యుద్ధానికి దిగింది. దీంతో ఆ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయి. భారత్ రెచ్చగొట్టడం వల్లే అఫ్గాన్ తమపై దాడులు చేస్తోందని పాక్ పసలేని వాదనలు చేస్తోంది. తమ దేశాన్ని చక్కబెట్టుకోలేక మనపై ఏడుస్తోంది. ఈ క్రమంలో భారత్.. అఫ్గాన్కు <<18023858>>సపోర్ట్<<>> చేస్తున్నట్లు ప్రకటించి పాక్ను చావుదెబ్బ తీసింది.