News November 23, 2024

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి శిండే?

image

మ‌హారాష్ట్రలో మ‌హాయుతి భారీ విజ‌యం సాధించ‌డంతో CM పీఠంపై ఉత్కంఠ నెల‌కొంది. కూట‌మిలో అత్య‌ధికంగా 132 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్న BJP CM ప‌ద‌విని వ‌దులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో శిండేకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని BJP యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొన‌సాగించవచ్చని సమాచారం.

Similar News

News January 16, 2026

తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పొంగులేటి చెప్పారు.

News January 16, 2026

గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుతో 8వేల మందికి ఉపాధి

image

AP: కాకినాడలో CM CBN ప్రారంభించనున్న AM గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ₹90వేల CRతో ఏర్పాటయ్యే ఇది దేశంలో మొదటిది. 8వేల మందికి ఉపాధి కల్పించనుంది. దశలవారీగా 2030కి 1.5 MT గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ షిప్పింగ్ ఫ్యూయల్‌కు ఇది ఉపకరిస్తుంది. ఇక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ మాలిక్యూల్స్‌ను జర్మనీ, జపాన్, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు.

News January 16, 2026

గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

image

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.