News November 24, 2024

త్వరలో భారత్‌కు బ్రిటన్ ‘కింగ్’

image

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్‌కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్‌సెస్ సెంటర్‌కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.

Similar News

News January 13, 2026

జగిత్యాల: గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

image

జగిత్యాల పట్టణంలో కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గల్ఫ్ ఏజెంట్ కాముని గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు DSP రఘు చందర్ వెల్లడించారు. పెంబట్లకు చెందిన గంగాధర్ అమాయకులను నమ్మించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.

News January 13, 2026

ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.