News November 24, 2024
IPL వేలానికి చిత్తూరు కుర్రాడు..!

మొట్టమొదటి సారిగా IPL వేలం పాటలోకి ఉ.చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు గిరీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లెకి చెందిన ఈయన SVUలో బీటెక్ పూర్తిచేశాడు. క్రికెట్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన IPL వేలంపాటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది. ఏ టీం సెలక్ట్ చేసుకుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 2, 2026
చిత్తూరు: టీచర్లకు గమనిక

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.
News March 2, 2026
చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
నేడు చిత్తూరు కలెక్టరేట్లో PGRS

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.


