News November 24, 2024

IPL వేలానికి మన కదిరి యువకుడు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందిన క్రికెటర్ గిరినాథ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రూ.30 లక్షల బెస్ ప్రైస్ తో అతడు తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. నేడు, రేపు దుబాయ్ వేదికగా ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. గిరినాథ్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది.

Similar News

News October 21, 2025

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

image

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.

News October 20, 2025

ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.

News October 20, 2025

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా రాధ

image

గుత్తి ఆర్ఎస్‌లోని ఎస్ఎస్ పల్లికి చెందిన చంద్రగిరి రాధను వైసీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాధ ఎంపిక పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాధ అన్నారు.