News November 24, 2024
ఎమ్మెల్యేలతో శిండే అత్యవసర భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శిండే ఈ భేటీ నిర్వహించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News February 5, 2026
YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.


