News November 24, 2024
గవర్నర్ను కలవనున్న హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈరోజు గవర్నర్ను కలవనున్నారు. ఆయన పార్టీ JMM స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. నవంబర్ 26న ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన ఈరోజు గవర్నర్ సంతోష్ గంగ్వార్తో భేటీ కానున్నారు. కాగా ఈ ఎన్నికల్లో 81 అసెంబ్లీ స్థానాలకు గానూ JMM కూటమి 56 చోట్ల గెలిచింది.
Similar News
News January 18, 2026
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సి విటమిన్లు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. బియ్యం కడిగిన నీళ్లను తలకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్ఫ్లేషన్గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.


