News November 24, 2024

చిన్న డెస్క్‌లో పనిచేయిస్తున్నారంటూ రూ.38 కోట్ల దావా

image

తన ఎత్తు, బరువుకు సరిపోని డెస్క్‌లో బలవంతంగా పనిచేయిస్తున్నారంటూ న్యూయార్క్‌ పబ్లిక్ లైబ్రరీ ఉద్యోగి విలియం మార్టిన్ కోర్టులో రూ.38 కోట్లకు దావా వేశారు. ‘నా ఎత్తు 6.2 అడుగులు. బరువు 163 కేజీలు. నా డెస్క్ చాలా చిన్నగా ఉంది. దీనివల్ల నాకు శారీరక, మానసిక సమస్యలు తలెత్తాయి’ అని పేర్కొన్నారు. అయితే అతను ఆఫీసులో నిద్రపోతుండటంతో సస్పెండ్ చేశామని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది.

Similar News

News March 23, 2026

ప్రధాని మోదీకి జగన్ శుభాకాంక్షలు

image

AP: అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా (8,931 రోజులు) ప్రధాని మోదీ రికార్డ్ నెలకొల్పిన నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్ Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ఆయనకు ఉన్న పట్టుదల, నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండి దేశానికి ఇలాగే సేవ చేయాలని కోరుకున్నారు. కాగా సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

News March 23, 2026

ఇళ్లు లేని పేదలకు శుభవార్త

image

AP: రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో కాలనీల్లో చేపట్టిన 1.42 లక్షల గృహాలు, 1.08 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి. ఈ నెల 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టినా ఫ్లాట్ కేటాయింపులు జరగని వారి ఖాతాల్లో <<19421760>>రూ.174 కోట్లను<<>> జమ చేయనున్నట్లు సమాచారం.

News March 23, 2026

కేంద్రం షాక్.. RRRకు ఎక్స్‌ప్రెస్ వే హోదా రద్దు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఎక్స్‌ప్రెస్ వే హోదాను రద్దు చేసి సాధారణ జాతీయ రహదారి స్టేటస్ కల్పించింది. ప్రాజెక్ట్ వ్యయం ₹38వేల కోట్లకుపైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో RRR స్పీడ్ లిమిట్ 120-130KMPH నుంచి 100కు తగ్గనుంది. అలాగే 8 లేన్ రోడ్డును రాష్ట్రం ప్రతిపాదించగా కేంద్రం దానిని ఇప్పుడు ఆరుకు కుదించింది.