News November 25, 2024
ఉమ్మడి కృష్ణాలో భారీ వర్షం కురిసే అవకాశాలు: APSDMA

హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) MD రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి సోమవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27 నుంచి 30 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ చెప్పారు.
Similar News
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 7, 2025
ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో బుక్ ఏ-కాల్ విత్-బి.ఎల్ఓకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 82 ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీ ఎన్నికల అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా ‘బుక్ ఏ-కాల్ విత్-బీఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ వెబ్సైట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారన్నారు.
News November 7, 2025
త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.


