News November 25, 2024
మదనపల్లె వాసికి అనంతపురంలో సత్కారం

మదనపల్లె పట్టణానికి చెందిన రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి లింగాల యుగంధరాచార్యుడికి అనంతపురంలో లేపాక్షి ఫౌండేషన్ వారు ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు మాట్లాడుతూ.. లింగాల యుగంధరాచార్యుడు తన రచనలతో ఎన్నో గ్రంథాలను రచించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం నాటికలు వేశారని తెలిపారు.
Similar News
News January 15, 2026
చిత్తూరు: మీ ఫ్రెండ్స్ను కలిశారా..?

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.
News January 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 14, 2026
టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.


