News November 25, 2024
తిరుపతి: ఎవరెస్టు శిఖరంపై వైసీపీ జెండా ఎగరవేసిన భూమన

ఎవరెస్టు శిఖరంలోని బేస్ క్యాంపులో 5364 మీటర్ల ఎత్తులో తిరుపతి వైసీపీ నేత భూమన అభినయ రెడ్డి ఆ పార్టీ జెండాను ఆదివారం ఎగురువేశారు. అత్యున్నత శిఖరం పైకి ఎక్కి పార్టీ జెండా ఎగరవేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News January 20, 2026
చిత్తూరు కలెక్టర్కు పురస్కారం

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.
News January 20, 2026
చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News January 20, 2026
క్రైం డేటాను నవీకరించాలి: చిత్తూరు ఎస్పీ

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తక్షణమే నవీకరించాలని.. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని ఎస్పీ తుషార్ ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్ ఉచ్చులో ప్రజలు పడకుండా చూడాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.


