News November 25, 2024

దావూద్‌తో ప్రాణహాని వల్లే దేశం విడిచా: లలిత్ మోదీ

image

దావూద్ ఇబ్ర‌హీం నుంచి ప్రాణ హాని వ‌ల్లే దేశం విడిచినట్లు IPL మాజీ ఛైర్మ‌న్ లలిత్ మోదీ తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటి అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై త‌న‌కున్న జీరో టోల‌రెన్స్ పాల‌సీ కార‌ణంగా దావూద్ త‌న‌ను టార్గెట్ చేశాడ‌ని రాజ్‌ ష‌మానీ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో లలిత్‌ వెల్లడించారు. త‌న హ‌త్య‌కు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని, దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే దేశం విడిచానన్నారు.

Similar News

News November 11, 2025

‘రిచా’ పేరిట స్టేడియం

image

WWC విన్నర్ రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

image

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.

News November 11, 2025

అయ్యప్ప దీక్షా నియమాలు (1/2)

image

☞ దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించే ఉండాలి.
☞ ఎప్పుడూ నల్లని దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలి.
☞ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి.
☞ పూజ, భిక్ష సమయాల్లో చొక్కా ధరించకూడదు.
☞ కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.
☞ నేలమీద నిద్రపోవాలి. మంచంపై కూర్చోరాదు.
☞ క్షురకర్మ చేయించుకోరాదు. గోళ్లు తీయకూడదు.
☞ కోపాన్ని వీడాలి. అబద్ధాలకూడదు. ☞ పాదరక్షలు ధరించరాదు. <<-se>>#AyyappaMala<<>>