News November 25, 2024
WTC: మళ్లీ భారత్ నంబర్-1

తొలి టెస్టులో ఆసీస్పై ఘన విజయంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 9 విజయాలు, 5 ఓటములతో 61.11 శాతంతో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా(57.69 శాతం) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక(55.56%), కివీస్(54.55%), సౌతాఫ్రికా(54.17%), ఇంగ్లండ్(40.79%), పాక్(33.33%), బంగ్లాదేశ్(27.50%), విండీస్(18.52%) ఉన్నాయి.
Similar News
News January 20, 2026
27న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 27వ తేదీన అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ భేటీకి హాజరుకావాలని లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపింది. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ భేటీలో కోరనుంది. పార్లమెంట్లో చర్చించే అంశాలు, బిల్లుల వివరాలను విపక్షాలకు అందజేయనుంది. కాగా JAN 28 నుంచి <<18812112>>బడ్జెట్ సమావేశాలు<<>> ప్రారంభం కానున్నాయి.
News January 20, 2026
‘జన నాయగన్’పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఎఫ్సీ దాఖలు చేసిన అప్పీల్పై తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
News January 20, 2026
వెండితో వెడ్డింగ్ కార్డు.. ధర ఎంతో తెలిస్తే షాకే!

జైపూర్(RJ)లో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వెడ్డింగ్ కార్డ్ చేయించారు. దీని ధర అక్షరాలా ₹25 లక్షలు. శివ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడాది పాటు కష్టపడి, ఒక్క మేకు కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో మొత్తం 65 మంది దేవుళ్ల ప్రతిమలను చెక్కించారు. తన కూతురి పెళ్లికి బంధువులతో పాటు సకల దేవతలను ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట.


