News November 25, 2024

అయ్యప్ప భక్తుల కోసం 62 స్పెషల్ రైళ్లు

image

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం SCR 62 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖ-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, హైదరాబాద్-కొట్టాయం మధ్య ఈ 62 రైళ్లు తిరగనున్నాయి. ఈ రైళ్ల షెడ్యూల్, హాల్టింగ్స్, ప్రయాణించే తేదీల వివరాలను పైనున్న ఫొటోలో చూడవచ్చు.

Similar News

News January 11, 2026

గంగూలీని దాటేసిన కోహ్లీ

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో గంగూలీ(308)ని దాటేశారు. ఇవాళ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆయనకు 309వ వన్డే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ జాబితాలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్(463) టాప్‌లో ఉన్నారు. ఇతర భారత ప్లేయర్లు ధోనీ(347), ద్రవిడ్(340), అజహరుద్దీన్(334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ WC-2027 ఆడినా ధోనీని కోహ్లీ దాటడం కష్టమే.

News January 11, 2026

రాజాసాబ్‌కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

image

ఒక్కో మూవీకి ₹150 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ రాజాసాబ్‌కు మాత్రం ₹100 కోట్లే పారితోషికం తీసుకున్నారని టాలీవుడ్ టాక్. జోనర్ చేంజ్‌తో పాటు VFX, భారీ సెట్స్ కోసం అధికంగా ఖర్చవడంతో రెబల్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక డైరెక్టర్ మారుతి ₹18 కోట్లు, యాక్టర్స్ సంజయ్ దత్ ₹5కోట్లు, రిద్ధి కుమార్ ₹3కోట్లు, మాళవికా మోహనన్ ₹2కోట్లు, నిధి అగర్వాల్ ₹1.5కోట్లు పొందారు. మొత్తం బడ్జెట్ రూ.400-450 కోట్లు.

News January 11, 2026

UPSC పరీక్షలకు కొత్త రూల్

image

UPSC పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్‌తో చెక్ పడనుంది.