News November 26, 2024

మినీ ఆస్ట్రేలియాగా మారిన పంజాబ్

image

IPL-2025 రిటెన్షన్స్‌, మెగా వేలంతో కలిపి పంజాబ్ కింగ్స్ 25 మందిని కొనుగోలు చేసింది. ఐదుగురు ఆసీస్ ప్లేయర్లను తీసుకుంది. జట్టు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇంగ్లిస్, హార్డీ, బార్ట్‌లెట్‌, అర్ష్‌దీప్, ప్రభ్ సిమ్రన్, వినోద్, వైశాఖ్, వధేరా, యశ్ ఠాకూర్, బ్రార్, హర్నూర్, షెడ్గే, పైలా, చాహల్, ముషీర్ ఖాన్, ప్రియాన్ష్ ఆర్య, ఫెర్గుసన్, జాన్సెన్, సేన్, ప్రవీణ్ దూబే, ఒమర్జాయ్.

Similar News

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.

News March 6, 2026

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

image

రష్యా ఆయిల్ కొనేందుకు 30 రోజుల పాటు భారత్‌కు US తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆ దేశ ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ దీనికి అంగీకరించినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్‌ను కొనేందుకే అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. కాగా భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలే ఉన్నట్లు తెలుస్తోంది.

News March 6, 2026

ప్రైవేట్ స్కూళ్లకు ‘ప్రొఫెషనల్’ షాక్

image

TG: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించే పనిలో ఉంది.