News November 26, 2024

కృష్ణా: నేడు అన్ని విద్యా సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30ని.లకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.

Similar News

News February 1, 2026

అవనిగడ్డ అమ్మాయికి గ్రూప్–2లో ఉద్యోగం

image

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్‌గా పనిచేశారు.

News January 31, 2026

విద్యార్థుల కోసం మైకులు బంద్ చేయండి: DSP రాజా

image

పది, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా సహకరించాలని DSP రాజా విజ్ఞప్తి చేశారు. ప్రార్థనా స్థలాలైన దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పరిమితికి మించి లౌడ్ స్పీకర్లు వాడకూడదని సూచించారు. శబ్ద కాలుష్యం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల సమయంలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ శబ్ద నియంత్రణ పాటించాలని కోరారు.

News January 31, 2026

జాతీయ స్థాయిలో కృష్ణా జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ డీ.కే బాలాజీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే చోటు దక్కించుకున్నాయని ఆయన తెలిపారు. వాటిలో ఒకటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టు కావడం విశేషమని అన్నారు.