News November 26, 2024
ఢిల్లీ క్యాపిటల్స్కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్ర మంత్రి విషెస్

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాణ విజయ్ ఐపీఎల్లో చోటు దక్కించుకోవడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొత్త అధ్యాయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు Xలో రాసుకొచ్చారు. కాగా విజయ్ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్ చెల్లించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
Similar News
News January 22, 2026
తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవి ఆలయాలు

వసంత పంచమి నాడు తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతాయి. TGలోని నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. సిద్దిపేట(D) వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కూడా ఎంతో విశిష్టమైనది. APలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు పండుగ రోజు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మెదక్(D) ముక్తేశ్వర క్షేత్రం, అనంతపురం(D) హేమావతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.
News January 22, 2026
చిరంజీవి మూవీ టికెట్ రేట్లు తగ్గింపు

AP: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్స్ తగ్గాయి. ప్రభుత్వం తొలి 10రోజులు మల్టీప్లెక్సుల్లో రూ.120, సింగిల్ స్క్రీన్స్లో రూ.100 పెంచుకునే అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సాధారణ రేట్లకే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TGలోనూ టికెట్స్ నార్మల్ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ.300+ కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News January 22, 2026
PM తర్వాత గంభీర్దే టఫ్ జాబ్: శశి థరూర్

నాగ్పూర్లో హెడ్ కోచ్ గంభీర్ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.


