News November 26, 2024
ఢిల్లీని వీడుతూ పంత్ ఎమోషనల్ పోస్ట్

IPL వేలంలో లక్నోకు వెళ్లిపోయిన రిషభ్ పంత్ ఢిల్లీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘టీనేజర్గా ఇక్కడ అడుగుపెట్టి 9 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమను గుండెలో పదిలంగా దాచుకుంటా. మిమ్మల్ని ఎప్పటిలాగే అలరిస్తా’ అని పంత్ రాసుకొచ్చారు.
Similar News
News January 14, 2026
మైక్రో చీటింగ్తో కాపురాల్లో చిచ్చు

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.
News January 14, 2026
పొంగల్.. టార్గెట్ ఎలక్షన్స్!

PM మోదీ ఈసారి తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ ఇంట పొంగల్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం రాజకీయ చర్చకు దారితీసింది. తన స్పీచ్లోనూ తమిళ పదాలు మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది TN అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ సన్నద్ధమవుతోంది. అధికారం చేజిక్కించుకుంటామని ఇప్పటికే కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో మోదీ తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది.
News January 14, 2026
విజయ్ ఫ్యాన్స్పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

ఓ వర్గం ఫ్యాన్స్ కావాలనే తమ సినిమాపై విమర్శలు చేస్తున్నారని పరాశక్తి టీమ్ ఆరోపిస్తోంది. ఫేక్ IDల ద్వారా కొంత మంది బురద జల్లుతున్నారని తాజాగా డైరెక్టర్ సుధా కొంగర అన్నారు. తమపై విమర్శలు చేస్తున్నది రాజకీయ వర్గాలు కాదన్నారు. పండుగకు విడుదలకు నోచుకోని మరో సినిమా హీరో ఫ్యాన్సే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఆమె విజయ్ ఫ్యాన్స్ను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది.


