News November 26, 2024
Warning: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?

ఆండ్రాయిడ్ 12- ఆండ్రాయిడ్ 15 వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫోన్లను వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఓఎస్లో చాలా లోపాలున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తేల్చిచెప్పింది. వీటిని హ్యాకర్లు గుర్తిస్తే వినియోగదారుల భద్రతకు తీవ్రస్థాయి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్డేట్స్ రాగానే వెంటనే ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News March 18, 2026
₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటనతో పాటు తాజ్మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.
News March 18, 2026
జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ను నియమించినట్లు మీడియా చిట్చాట్లో తెలిపారు.


