News November 26, 2024

నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

image

నిల‌బడి నీళ్లు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌ వ్య‌వ‌స్థ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. నిల‌బడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్‌కు దారితీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాల‌ని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.

Similar News

News January 18, 2026

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి

image

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమ‌లలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది.

News January 18, 2026

మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.

News January 18, 2026

ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.