News November 27, 2024

దారుణం: 87మందిపై వైద్యుడి అత్యాచారం

image

నార్వేకు చెందిన ఆర్నీ బై అనే గైనకాలజిస్ట్ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ దానికి కళంకం తీసుకొచ్చాడు. గడచిన 20 ఏళ్లలో 14 నుంచి 67 ఏళ్ల వయసున్న 87మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ అఘాయిత్యాలను రహస్యంగా సీసీటీవీ కెమెరాలో చిత్రీకరించాడు. ఇద్దరు మైనర్ల ఫిర్యాదుతో అతడి ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, 6వేల గంటల ఫుటేజీని అతడి కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 13, 2025

ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

image

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు చేయడంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే’ ’ అని ఆమె తెలిపారు.

News September 13, 2025

అహంకారం వినాశనానికి కారణం

image

రావణుడు విద్యావంతుడు, గొప్ప పండితుడు, శివ భక్తుడు. ఆయనకు పాలనలోనూ మంచి పరిజ్ఞానం ఉంది. అయితే, అహంకారం, దుర్గుణాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. ధర్మం బోధించిన భార్య మండోదరి మాటలను సైతం రావణుడు పెడచెవిన పెట్టాడు. తన అహంకారం కారణంగా సీతను అపహరించి, చివరకు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి, నాశనమయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తికైనా దుర్గుణాలు, అహంకారం అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని రావణుడి జీవితం తెలియజేస్తోంది.

News September 13, 2025

మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

image

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.