News November 27, 2024
రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు ఆత్మహత్యాయత్నం

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజమండ్రి జెఎన్ రోడ్డులోని సాయి సుధా రెసిడెన్సీలో బుధవారం ఉదయం ఒక కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు ముగ్గురు కూల్డ్రింక్లో విషం కలుపుకొని తాగారు. అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 22, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News October 21, 2025
రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.
News October 21, 2025
అమరవీరుల త్యాగాలు మరువలేనివి: తూ.గో. ఎస్పీ

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21న (మంగళవారం) పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శాంతియుత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి త్యాగనిరతి అద్భుతమని ఆయన కొనియాడారు.