News November 27, 2024

విశాఖ: రైల్వేస్ జట్టుపై గెలుపొందిన చత్తీస్‌గఢ్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ ట్రోఫీలో భాగంగా విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో రైల్వేస్ జట్టుపై చతీస్‌గఢ్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన రైల్వేస్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చతీస్‌గఢ్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.

Similar News

News September 19, 2025

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

image

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.

News September 19, 2025

దేవీ మండపాలకు సింగిల్ విండో అనుమతులు: విశాఖ సీపీ

image

విజయదశమి దేవీ మండపాల ఏర్పాటుకు https://durgautsav.net వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. జీవీఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల సమన్వయంతో ఈ పోర్టల్ని ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలని కోరారు. మండపాలకు క్యూఆర్ కోడ్ ఇస్తారని, దాన్ని మండపాలు వద్ద ప్రదర్శించాలని తెలిపారు.

News September 19, 2025

యారాడ కొండపై కనకదుర్గమ్మ.. ప్రత్యేక బోటు ఏర్పాటు

image

యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.