News November 28, 2024
రాగి పాత్రలో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో..

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
* క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
* థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది.
* కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
* నేచురల్ యాంటీబయాటిక్గా పని చేస్తుంది.
* ఆహారం జీర్ణమవడానికి తోడ్పడుతుంది.
* రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది.
* రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* చర్మ ఆరోగ్యంతో పాటు శరీర దోషాలు దూరమవుతాయి.
* కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సాయపడుతుంది.
Similar News
News November 5, 2025
ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?


