News November 28, 2024
HYD: కాంగ్రెస్ను బద్నాం చేద్దామని BRS ప్లాన్: కల్వ సుజాత

BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News September 16, 2025
HYDలో రహదారులు గోదారులవుతోంది ఇందుకే!

HYDలో రహదారులు గోదారులు కావడానికి జనాభాకు అవసరమైన స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చెరువులు, నాలాలు కబ్జా కావడం ప్రధాన కారణాలు. వీటన్నింటితో పాటు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించకపోవడంతో వరద ముంపునకు కారణమవుతున్నట్లు హైడ్రా గుర్తించింది. ఇటీవల మైత్రివనం చౌరస్తా వద్ద చేపట్టిన వరద తరలింపు చర్యలు ఫలితాలు ఇవ్వడంతో నగరంలో మరో 40 ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
News September 16, 2025
HYD: ఎకరా రూ.101 కోట్లు.. ఇది బేస్ ప్రైజే..!

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
News September 16, 2025
నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్

నేడు హైదరాబాద్కు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.