News November 28, 2024
మా తదుపరి లక్ష్యం అదే: అజిత్ పవార్

గతంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ చీఫ్ అజిత్ పవార్ పేర్కొన్నారు. కొత్త తరాన్ని ముందుకు తీసుకువస్తామని, అందులోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. Decలో పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3 స్టేట్స్లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్రఫుల్ పటేల్ తెలిపారు.
Similar News
News July 11, 2025
తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.
News July 11, 2025
HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారించనుంది.
News July 11, 2025
భారత్పై 11వ సెంచరీ బాదిన రూట్

భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.