News November 28, 2024
డిసెంబర్ 5లోగా ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాటితో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.
Similar News
News March 18, 2026
రాముడి పాదంతో రామడుగుగా మారింది ఈ గ్రామం

అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చింది. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.
News March 18, 2026
నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 18, 2026
బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.


