News November 29, 2024
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి: ఎంపీ

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని ఎక్స్లో పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.
News March 13, 2026
GVMC అజెండాలో వివాదాస్పద అంశాలు

GVMC స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం నేడు మేయర్ పీలా అధ్యక్షతన జరగనుంది. ప్రధాన అజెండాలో 193 అంశాలు ఉండగా.. టేబుల్ అజెండాగా మరో 60 అంశాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో తిరస్కరించిన బయో టాయిలెట్లు, హెలీపాడ్ పనులు, బీచ్రోడ్ గ్రిల్స్ పెయింటింగ్ బిల్లులు మళ్లీ చేర్చడం చర్చనీయాంశమైంది. కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు అప్పట్లో రూ.150గా ఉన్న ఖర్చును ఇప్పుడు రూ.1500గా చూపిన బిల్లు కూడా అజెండాలో ఉంది.
News March 13, 2026
విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్లెట్కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు


