News November 29, 2024
నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ

వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 20, 2026
ANU: ఫిబ్రవరి 3 నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. బీపీఈడీ, యుజీ పీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
News January 20, 2026
పశు ఔషది విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు : కలెక్టర్

జిల్లాలో పశు ఔషది విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన జనరిక్ మందులను అందించడం కోసం.”పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు.
News January 20, 2026
ఇంటర్మీడియట్ పరీక్షలు ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధత, నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, సమీప ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, పోలీస్ శాఖతో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.


