News November 29, 2024
మడకశిర వద్ద బాలుడి దారుణ హత్య!

మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ నిన్న అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మడకశిర సరిహద్దులోని కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడు మృతిచెంది కనిపించాడు. దుండగులే ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించి వాస్తవ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100 అనే బ్యానర్ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.


