News November 29, 2024
గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి

TG: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News March 6, 2026
తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు.
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
News March 6, 2026
బెంబేలెత్తించిన బెథెల్

T20WC: సెమీఫైనల్లో భారత్ గెలిచినా ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ మనసులు గెలిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ భారత ఆటగాళ్లను, అభిమానులను వణికించారు. 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 రన్స్ చేశారు. బెథెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడారంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.


