News November 29, 2024
తొలిరోజే 100శాతం పెన్షన్ల పంపిణీ: కలెక్టర్ లక్ష్మీశ

డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందు రోజే నవంబర్ 30న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News March 6, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే
News March 6, 2026
కృష్ణా: గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో పంటైన అపరాల సాగు కోత పనులు ఊపందుకున్నాయి. అయితే అపరాల సాగు ప్రారంభ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అపరాలు విక్రయాలు చేద్దామన్న మద్దతు ధర లేక రైతులు సిండికేట్గా మారిన దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 6, 2026
విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలి: కృష్ణా కలెక్టర్

విద్యార్థులు పెడదోవ పట్టకుండా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంచి, చెడుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి తన చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.


