News November 29, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. US సర్కార్కు ప్రభాకర్ రావు పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని US ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, TG ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు TG పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Similar News
News April 1, 2026
రాష్ట్రంపై క్యాన్సర్ పంజా..!

TG: రాష్ట్రంలో ఈ ఏడాది చివరి నాటికి 46,762 క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ICMR నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో పురుషులు 21,252 మంది కాగా.. మహిళలు 25,510 మంది ఉన్నారు. పొగాకు వల్లే పురుషుల్లో 58.8%, మహిళల్లో 29.7% క్యాన్సర్లు వస్తున్నాయి. ఇక HYDలో ప్రతీ ఆరుగురు మహిళల్లో ఒకరికి ముప్పు ఉంది. పురుషుల్లో ఓరల్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంది.
News April 1, 2026
ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్

తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్ను రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది.
News April 1, 2026
‘అమరావతికి చట్టబద్ధత’ అంటే ఏం చేస్తారు?

ఉమ్మడి <<19529271>>ఆంధ్రప్రదేశ్ను<<>> 2014లో విభజించారు. AP, TGకి పదేళ్లు HYD ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ‘ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఉంటుంది’ అని సెక్షన్ 5, సబ్సెక్షన్ 2లో పొందుపర్చారు. ఇప్పుడు సవరణ బిల్లులో ‘ఆంధ్రప్రదేశ్కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది’ అని మారుస్తారు. ఇక CRDA నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని పరిధిలోకే వస్తుందనే అంశాన్నీ బిల్లులో చేర్చారు.


