News November 29, 2024
అదానీకి అండగా జపాన్ బ్యాంకులు!

అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదైనప్పటికీ గౌతమ్ అదానీతో సంబంధాలు కొనసాగించేందుకే జపాన్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయని సమాచారం. వాటి ప్రభావం ఎక్కువకాలం ఉండదని మిజుహో ఫైనాన్స్, సుమిటోమో మిత్సూయి ఫైనాన్స్, మిత్సుబుషి UFJ ఫైనాన్స్ భావిస్తున్నాయని తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంపదను సృష్టించగలిగే గ్రూప్ అసెట్సే ఇందుకు కారణం.
Similar News
News March 25, 2026
శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 25, 2026
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.
News March 25, 2026
షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్తో పిల్లలకు భారీ ఆస్తి!

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్లో ఆడిన ప్రతి సీజన్లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.


