News November 29, 2024
చివరి 4 బంతుల్లో 23 రన్స్.. టై.. గెలుపు

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, మిజోరం మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. పంజాబ్ గెలిచేందుకు చివరి 4 బంతుల్లో 24 రన్స్ అవసరమవగా క్రీజులో ఉన్న బ్రార్ (4, 6, wd, 6, 6) ఒక వైడ్ సహా 23 పరుగులు రాబట్టారు. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో రమణ్దీప్14(5) కొట్టడంతో పంజాబ్ 8 రన్స్ తేడాతో గెలిచింది.
Similar News
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News September 18, 2025
OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.