News November 29, 2024

ప్రొస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ వాటర్ వెపర్ థెరపీతో చికిత్స

image

ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యకు ఆపరేషన్ లేకుండా వాటర్ వెపర్ థెరపీతో AINU హాస్పిటల్ చికిత్స అందిస్తోంది. అంగ‌స్తంభ‌న, వీర్య‌స్ఖ‌ల‌నం స‌రిగా కాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లకు ఈ వాట‌ర్ వెపర్ థెర‌పీతో సరైన పరిష్కారం లభిస్తుంది. ఇది చేసిన త‌ర్వాత నెల రోజుల్లోపు ఫ‌లితాలు క‌నిపిస్తాయని, ఈ స‌మ‌స్య‌లు ఉన్నవారికి ఈ చికిత్స ఒక వ‌రం లాంటిద‌ని AINU ఎండీ, చీఫ్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున తెలిపారు.

Similar News

News November 8, 2025

హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

image

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT

News November 8, 2025

హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

image

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.