News November 29, 2024

Stock Market: వీకెండ్‌లో లాభాలు

image

స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభాల‌తో ముగించాయి. Heavy Weight Stocksకు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో Sensex 759 పాయింట్ల లాభంతో 79,802 వ‌ద్ద‌, Nifty 216 పాయింట్ల లాభంతో 24,131 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఫార్మా, రియ‌ల్టీ, ఆటో, IT, ఫైనాన్స్ రంగ షేర్లు Greenలో ముగిశాయి. Bharti Artl 4.40%, Sun Pharma 2.87%, Cipla 2.63%, M&M లాభ‌ప‌డ్డాయి. Power Grid, Shriram Fin, Hero Motoco, Hdfc Life న‌ష్ట‌పోయాయి.

Similar News

News January 13, 2026

ముంబైలో నయా దందా.. 30 వేలకే భారత పౌరసత్వం?

image

ముంబైలో అక్రమ వలసదారులపై NDTV కథనం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారికి కేవలం రూ.7 వేల నుంచి రూ.30 వేలకే బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు అందుతున్నట్లు వెల్లడించింది. 61 ప్రాంతాల్లో 3,014 మందిని పరిశీలించగా వీరిలో 96% అక్రమంగా భారత్‌లోకి వచ్చిన ముస్లింలేనని తెలిపింది. ‘మాల్వాణి ప్యాటర్న్’ పేరుతో వీరంతా ఓటు బ్యాంకులుగా మారుతున్నారని పేర్కొంది.

News January 13, 2026

మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

image

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

image

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్‌ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్‌ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.