News November 29, 2024

రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం: పవన్

image

AP: బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్‌వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని Dy.CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ.73 చొప్పున విదేశాలకు అమ్ముతూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Similar News

News November 11, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.isro.gov.in/

News November 11, 2025

మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

image

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

News November 11, 2025

శబరిమలకు అద్దె బస్సులు

image

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.