News November 29, 2024
హైబ్రిడ్ మోడల్ తప్పదు.. పాక్కు తేల్చిచెప్పిన ఐసీసీ?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాకిస్థాన్కు ICC ఈరోజు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తొలుత అందుకు ససేమిరా అన్న పీసీబీ, రేపటి వరకు ఆలోచించుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే <<14743739>>మీటింగ్ రేపటికి వాయిదా పడిందని<<>> ఐసీసీ వర్గాలు తెలిపాయి. వేరే దారి లేని నేపథ్యంలో పీసీబీ ఒప్పుకోక తప్పదని పేర్కొన్నాయి.
Similar News
News January 13, 2026
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వరి ధాన్యం కొనుగోలు

TG: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డును సాధించింది. ఈ ఏడాది 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీంతో రాష్ట్ర చరిత్రలో 2020-2021లో సాధించిన 70.2లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించింది. వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.16,606కోట్లు చెల్లించింది. సన్నరకం వరి ధాన్యానికి బోనస్గా రూ.1,425 కోట్లు సైతం చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
News January 13, 2026
భోగి పర్వదినాన గోదా రంగనాథ కళ్యాణం

భోగి పర్వదినాన ఆండాళ్ అమ్మవారు-శ్రీ రంగనాథ స్వామి దివ్య కళ్యాణం నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ కళ్యాణం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి, దాంపత్య అన్యోన్యత పెరిగి, కుటుంబంలో శాంతి, శుభమంగళాలు స్థిరపడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ అరుదైన పుణ్యావకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదమందిర్లోనే గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందండి. ఇవాళే మీ పేరు, గోత్రంతో సంకల్పం <
News January 13, 2026
చలాన్ పడగానే డబ్బు కట్ కావాలా?

చలాన్ పడితే ఆటోమేటిక్గా డబ్బు కట్ అయ్యేలా బ్యాంక్ అకౌంట్ <<18838769>>లింక్<<>> చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినంగా మారుతుందని కొందరు భావిస్తుండగా చలాన్ల ఇష్యూలు మరింత పెరుగుతాయని వాహనదారులు భయపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్ల తప్పుడు ఫైన్లు పడితే కట్ అయిన డబ్బును తిరిగి పొందడమూ కష్టమేనంటున్నారు. ఇంతకీ ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?


