News November 29, 2024

30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తాం: టీఎస్ చేతన్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీన చేపడుతున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో 30వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు సొమ్ము అందిస్తామన్నారు. అందుబాటులో లేని వారికి 2న అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2,65,277 మందికి రూ.114.29 కోట్లు ప్రభుత్వం అందించనుందని తెలిపారు.

Similar News

News January 13, 2026

అనంతపురం ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెండ్

image

అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దాడి ఘటనలో ఎస్పీ జగదీశ్ చర్యలు తీసుకున్నారు. ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు దాడికి సంబంధించిన వీడియోలను అందజేశారు. ఈ ఘటనలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గన్‌మెన్ షేక్షావలి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 13, 2026

అనంతపురం కొత్త జాయింట్ కలెక్టర్ నేపథ్యం ఇదే!

image

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన 2019 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇప్పటి వరకు నరసాపురం సబ్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత జేసీ శివ నారాయణ్ శర్మ అన్నమయ్య జేసీగా బదిలీ అయ్యారు.

News January 13, 2026

అనంతపురం కొత్త జాయింట్ కలెక్టర్ నేపథ్యం ఇదే!

image

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన 2019 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇప్పటి వరకు నరసాపురం సబ్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత జేసీ శివ నారాయణ్ శర్మ అన్నమయ్య జేసీగా బదిలీ అయ్యారు.