News November 30, 2024
నేడు భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్

అండర్-19 ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు మహ్మద్ అమన్ సారథ్యం వహిస్తున్నారు. జట్టులో IPL వండర్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. U19 ఆసియా కప్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొమ్మిదో టైటిల్ బరిలో భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది.
Similar News
News March 15, 2026
‘మన మిత్ర’లో ఆరోగ్య సేవలు.. వాట్సాప్లో HI అని మెసేజ్ చేస్తే

AP: ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఆరోగ్య సేవలూ అందుబాటులోకి వచ్చాయి. HI అని మెసేజ్ చేస్తే GOVT ఆస్పత్రుల్లో OP అపాయింట్మెంట్, హెల్త్ కార్డు, ఆరోగ్య శాఖ ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ అడిగిన వివరాలు సమర్పించి క్యూలో నిలబడకుండా అపాయింట్మెంట్, రక్త నిల్వలు, ఔషధాల వివరాలు, NTR వైద్య సేవా కార్డు కింద ఆస్పత్రుల్లో అందే సేవలను పొందవచ్చు. కార్డులోని వివరాలనూ అప్డేట్ చేసుకోవచ్చు.#ShareIt
News March 15, 2026
వారిద్దరినీ వదులుకొని KKR తప్పు చేసింది: కుంబ్లే

KKR 2024లో మూడోసారి IPL ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్లది కీలక పాత్ర అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పారు. అలాంటి వాళ్లను వదులుకోవడం కోల్కతా చేసిన మిస్టేక్ అని అభిప్రాయపడ్డారు. కీలక ప్లేయర్లను తమ వద్దే ఉంచుకోవడం ఎంత ముఖ్యమన్నది జట్టు అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే టైటిల్ పోటీలో నిలవలేదని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం శ్రేయస్ PBKS, సాల్ట్ RCBలో చేరిన విషయం తెలిసిందే.
News March 15, 2026
నావిక్కు అంతరాయం

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.


