News November 30, 2024

అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి

image

AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2026

లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

image

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ 12వ ఫ్లోర్‌లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్‌ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.

News March 27, 2026

పెంటగాన్‌లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

image

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్‌హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?

News March 27, 2026

‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

image

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.