News November 30, 2024
NZB: విద్యార్థి మృతి.. కేసు నమోదు

నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. బోధన్కు చెందిన శివజశ్విత్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే జ్వరంతో శుక్రవారం విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు 4వ టౌన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ విచారణ చేపట్టారు.
Similar News
News January 27, 2026
నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 27, 2026
నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.
News January 27, 2026
NZB: రూ.782.31 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.782.31 కోట్లు రుణ మాఫీ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నాలుగు విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు మాఫీ చేశారన్నారు. అలాగే రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.15.40 కోట్ల నేరుగా జమ చేసినట్లు వివరించారు.


