News November 30, 2024

కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన కార్యక్రమాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై BJP ‘6 అబద్ధాలు 66 మోసాలు’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. నేటి నుంచి DEC 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్లను ప్రదర్శించనుంది. రేపు జిల్లా స్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. DEC 2, 3న బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు నిర్వహించనుంది.

Similar News

News September 16, 2025

16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

image

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.

News September 16, 2025

యువరాజ్, ఉతప్ప, సోనూసూద్‌లకు ED సమన్లు

image

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.

News September 16, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య‌పై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.