News November 30, 2024

సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.7.31 లక్షలు స్వాహా

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.7.31 లక్షలు పోగొట్టుకున్న ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బండారు రమాదేవికి ఇటీవల ముంబై పోలీస్ అధికారులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె దశలవారీగా రూ.7. 31 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆ నంబర్‌కు రమాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ మేరకు బాధితురాలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News April 5, 2026

NLG: ఏప్రిల్‌లోనే రూ. 8.50 కోట్ల పన్ను వసూలు!

image

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

News April 5, 2026

NLG: ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే రాయితీ!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు.

News April 5, 2026

నల్గొండలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

image

NLG: స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.